
టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రయ్యారు. అయన భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దేశమంత రామనామ స్మరణతో పుకలకించిపోతున్న వేల.. సుహాస్ ఇంట వారసుడు అడుగుపెట్టాడు. ఇదే విషయాన్నీ సుహాస్ తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటుడిగా పరిచయమైనా సుహాస్.. అనంతరం సినిమాల్లో కమెడియన్ గా అడుగుపెట్టారు. అలా వరుస అవకాశాలు అందుకున్న సుహాస్.. ఆ తరువాత కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా మారాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వరించింది. ఈ సినిమా తరువాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా అలరించలేదు. ప్రస్తుతం సుహాస్ అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.