తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ సమంత. రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన ఆమె, ఈ తెల్లవారిజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సమంతతో పాటు ‘ఓ బేబి’ దర్శకురాలు నందిని రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సమంత మీడియా తో మాట్లాడుతూ, స్వామివారిని వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామివారి దగ్గరికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పారు.
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5వ తేది రిలీజ్ కానున్న ‘ఓ బేబి’ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, అమ్మను గౌరవించే సినిమా ఇది అన్నారు.. సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.