మీర్ పేట్ లో కూతురి పెండ్లి కోసం దాచిన బంగారం చోరీ

మీర్ పేట్ లో కూతురి పెండ్లి కోసం దాచిన బంగారం చోరీ

ఎల్​బీనగర్, వెలుగు: హాస్పిటల్​కు వెళ్లొచ్చేలోగా ఇంట్లో దొంగలు పడి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లిన ఘటన మీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. జిల్లెలగూడలోని న్యూ రాఘవేందర్ నగర్ కాలనీకి చెందిన గిట్టగొని నరసింహ, యాదమ్మ దంపతులకు ఓ కూతురు ఉంది. కొంతకాలంగా బాలమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. శుక్రవారం రాత్రి 7.25 గంటలకు  భర్త, కూతురు ఆమెను గడ్డిఅన్నారంలోని ఓ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. 8.45 తిరిగి ఇంటికి రాగా మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. నరసింహ ఇంట్లోకి వెళ్లి చూడగా.. 30 తులాల బంగారు నగలు, డబ్బు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. కూతురి పెండ్లి కోసం దాచుకున్న నగలను దొంగలు ఎత్తుకెళ్లారంటూ బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.
 కేసు ఫైల్ చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.