ఏవోబీలో మావోల అలజడి..ఇద్దరు జవాన్లకు గాయాలు

ఏవోబీలో మావోల అలజడి..ఇద్దరు జవాన్లకు గాయాలు

ఏవోబీలో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. శనివారం ఆంధ్ర-ఒడిశా సరహద్దుల్లో మందుపాతర పేల్చారు. ఈ ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. ఏవోబీలో మావో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.