విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన సాగించాలి

విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన సాగించాలి

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని అదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్ లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. 

ఇవి కూడా చదవండి: 

ఎడ్లబండిపై గురువు... బండిలాగిన విద్యార్థులు

పైలట్ అప్రమత్తతో తప్పిన ల్యాండింగ్ ప్రమాదం