హిమాయత్​నగర్​ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..మహారథంపై వేంకటేశుడు

హిమాయత్​నగర్​ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు..మహారథంపై వేంకటేశుడు

బషీర్​బాగ్, వెలుగు: హిమాయత్​నగర్ టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శ్రీదేవి , భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారు మహారథంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది.