
మల్కాజిగిరి, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 11న రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.