ప్రియురాలి కోసం దొంగగా మారిన హోంగార్డు

ప్రియురాలి కోసం దొంగగా మారిన హోంగార్డు

జీడిమెట్ల, వెలుగు: అతడు ఒకప్పుడు హోంగార్డు. వివాహేతర సంబంధం, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం చైన్​స్నాచర్​గా మారాడు. ఏకంగా 36 చైన్​ స్నాచింగ్​ కేసులు నమోదైనా అతని తీరు మారలేదు. ఇటీవల దొంగతనాలు చేయడంతో బాలానగర్​ ఎస్​వోటీ, బాచుపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్​ చేశారు.

బాలానగర్​ డీపీసీ సురేశ్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​కు చెందిన మహేందర్​ సింగ్​ సైబరాబాద్​కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేసేవాడు. అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగడానికి డబ్బులు సరిపోకపోవడంతో దొంగగా మారాడు. 2012 నుంచి 2015 వరకు బాలానగర్,​ జీడిమెట్ల, సనత్​నగర్, కూకట్​పల్లి, కేపీహెచ్​బీ తదితర ప్రాంతాల్లో అతనిపై 36 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.

 పీడీ యాక్ట్​ సైతం నమోదు చేశారు. అయినా తీరు మారలేదు. గత నెల 24న బాచుపల్లిలో వాకింగ్​ చేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు. అనంతరం జీడిమెట్ల, జగద్గిరిగుట్టలో మరో ఇద్దరు మహిళల బంగారు గొలుసు దొంగలించాడు. దీంతో పోలీసులు అతన్ని సోమవారం అరెస్టు ​చేశారు. అతని వద్ద  రూ.5 లక్షల విలువ చేసే బంగారం, బైక్  స్వాధీనం చేసుకున్నారు.