కొడంగల్, వెలుగు: పూజగదిలో పెట్టిన దీపం అంటుకుని ఇల్లు దగ్ధం అయింది. ఈ ఘటన కొడంగల్ మండలం టెకుల్కోడ్లో ఆదివారం జరిగింది. బాధితురాలు యాదమ్మ పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి కూలి పనికి వెళ్లింది. ప్రమాదవశాత్తు దీపం కింద పడి ఇంటికి నిప్పంటుకుంది. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే ఇంట్లో ఉన్న బియ్యం, జొన్నలు, బట్టలు, రూ.30వేల నగదు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. కూలి పని చేసుకుని బతికే యాదమ్మ రోదన అందరని కలిచివేసింది.
