ఇచ్చినోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎట్ల కేటాయిస్తరు?

ఇచ్చినోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎట్ల కేటాయిస్తరు?
  • ఇచ్చినోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎట్ల కేటాయిస్తరు?
  • కిస్మత్ పురాలో అధికారులను నిలదీసిన స్థానికులు

గండిపేట, వెలుగు: లాటరీ పద్ధతిలో గతంలో వచ్చిన వారికే మరోసారి డబుల్ బెడ్రూం ఇండ్లు ఎలా వస్తాయంటూ కిస్మత్​పురాలో స్థానికులు అధికారులను నిలదీశారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధి కిస్మత్​పురాలో నిర్మించిన 60 డబుల్ బెడ్రూం ఇండ్లకు వెయ్యిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి లక్కీ డ్రాను మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  లక్కీ డ్రా తీసిన ఎమ్మెల్యే 113 మంది అర్హులను గుర్తించారు. 

అయితే, ఈ ఎంపికపై స్థానిక లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గతంలో కేటాయించిన వారికే మళ్లీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఎలా ఇస్తారంటూ అధికారులను నిలదీశారు. ఇండ్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఏండ్లుగా ఇక్కడ ఉంటున్న వారికి ఇండ్లు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సమక్షంలోనే స్థానికులు..  అధికారులను నిలదీసి ఆందోళన చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.