ఒబామాకు ఇండియా గురించి ఏం తెలుసు?

ఒబామాకు ఇండియా గురించి ఏం తెలుసు?

ముంబై: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రాహుల్‌‌లో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయని, ఆయన నిరుత్సాహంగా కనిపిస్తారని ది ప్రామిస్ ల్యాండ్ అనే పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు. అలాగే పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలా రాహుల్ కనిపిస్తారని ఒబామా చెప్పారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఒబామా వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని రౌత్ అన్నారు.

‘భారత రాజకీయ నేతలపై ఓ విదేశీ పొలిటీషియన్ అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసుండాల్సింది కాదు. ఆ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. మేమెప్పుడూ ట్రంప్ పిచ్చోడని అనలేదు. అయినా ఈ దేశం గురించి ఒబామాకు ఏం తెలుసు?’ అని రౌత్ పేర్కొన్నారు.