టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..

టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..

స్మార్ట్​ ఫోన్​ వచ్చినప్పటి నుంచి కళ్లన్నీ దానిమీదే. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్​ చేతిలోనే ఉంటుంది. ఎన్నిగంటలైనా రెప్ప ఆర్పకుండా ఫోన్​ చూస్తుంటారు కొందరు. అయితే, ఇలా చూడడం వల్ల చూపు మీద ఎఫెక్ట్​ పడుతుందని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్. ఆ ప్రమాదం నుంచి   తప్పించుకునేందుకు ఈ టిప్స్ పాటించాలి.

ఫోన్ చూస్తున్నప్పుడు ఆ హై ఎనర్జీతో ఉన్న విజిబుల్ లైట్ కంటిలోపలికి దూసుకెళ్తుంది. అదేమీ పట్టించుకోకుండా అలానే వాడుతుంటే రెటీనా దెబ్బతింటుంది. కొంతకాలానికి కాటరాక్ట్​ చేయించుకోవాల్సి రావచ్చు. అలాగే వయసు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్​ (ఎఎమ్​డి) అంటే చూపు మసకబారడం అనే సమస్య తలెత్తొచ్చు. బ్రైట్ నెస్ తగ్గించాలి. స్క్రీన్​ చూడగలిగినంత బ్రైట్ నెస్ మాత్రమే పెట్టుకోవాలి. దానికి బదులు డిమ్​గా కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు కూడా. అప్పుడు కళ్లకు ఇబ్బందిలేకుండా ఉంటుంది. 


స్క్రీన్​ ఎంత సేపు చూస్తున్నామనేది కూడా ముఖ్యం. ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లు అలసిపోతాయి. పొడిబారతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే 20–20–20 రూల్ పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్​ ఏదైనా 20 సెకన్లు చూడాలి. ఈ సింపుల్ ఎక్సర్​సైజ్​ వల్ల కళ్లకు బ్రేక్ దొరుకుతుంది. అప్పుడు రీ అడ్జస్ట్ అయ్యి రీ ఫోకస్ చేయగలవు. ఈ మధ్య చాలా ఫోన్స్​లో హ్యాండీ నైట్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ అనే ఫీచర్స్ వస్తున్నాయి. వాటిని ఎనేబుల్ చేసుకుంటే బ్లూ లైట్ నుంచి తప్పించుకోవచ్చు.

ఇది ముఖ్యంగా సాయంత్రాలు  బాగా ఉపయోగపడుతుంది. కళ్లను రెగ్యులర్​గా ఆర్పుతుండాలి. తక్కువసార్లు కళ్లు ఆర్పడం వల్ల కళ్లు పొడిబారి, దురద పెడతాయి. అందుకని కనురెప్ప వేయాలనే విషయాన్ని గుర్తు ఉంచుకుని మరీ కళ్లు ఆర్పుతుండాలి. ఐ డ్రాప్స్ వాడడం వల్ల కళ్లు తేమతో, ఇబ్బందిలేకుండా ఉంటాయి. గంటల తరబడి ఫోన్​ స్క్రోల్​ చేయడం మానేయాలి. కళ్లకు బ్రేక్ ఇవ్వాలి. ప్రతి గంటకు ఒకసారి ఫోన్​కి బ్రేక్ ఇవ్వాలి.