8న YSR జయంతిని భారీగా ప్లాన్ చేసిన జగన్

8న YSR జయంతిని భారీగా ప్లాన్ చేసిన జగన్

కడప జిల్లా : ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఇడుపులపాయలో భారీఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. వైఎస్ఆర్ ఘాట్ లోనే పెంచిన పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు.