యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ..దర్శనానికి 4 గంటల సమయం

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ..దర్శనానికి 4 గంటల సమయం

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి దివ్యక్షేత్రంలో మార్చి 26 ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి కిటకిటలాడాయి. స్వామివారి స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.

కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. దర్శనానంతరం స్వామివారి  ప్రసాదం క్యూ లైలో కూడా భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఆదివారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు.