హుజూర్ నగర్ కౌంటింగ్: ఆధిక్యంలో టీఆర్ఎస్

హుజూర్ నగర్ కౌంటింగ్: ఆధిక్యంలో టీఆర్ఎస్

హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. సైది రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… హుజూర్ నగర్ లో ఇప్పటివరకు ఎవరూ నమోదు చేయని మెజారిటీతో టీఆర్ఎస్ గెలవబోతుందని అన్నారు. ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి 14వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

హుజేర్ నగర్ లో మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల 754 ఓట్లు. మొదటి మూడు రౌండ్లలో నేరేడుచర్ల మండలం రిజల్ట్స్, 4,5 రౌండ్లలో పాలకవీడు మండలం ఓట్ల లెక్కింపు,   6,7,8 రౌండ్లలో మంఠపల్లి మండలం ఓట్ల లెక్కింపు, 9,10,11 రౌండ్లలో మేళ్ల చెరువు ఓట్ల లెక్కింపు, 12,13 రౌండ్లు చింతలపాలెం, 14,15,16,17,18 కౌండ్లలో హుజూర్ నగర్ కౌంటింగ్, 19,20,21,22 రౌండ్లలో గరిడే పల్లి మండల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి