కూల్చివేయనున్న వందేళ్ల నాటి రాతి నిర్మాణం

కూల్చివేయనున్న వందేళ్ల నాటి రాతి నిర్మాణం

హైదరాబాద్ లో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన రాతి నిర్మాణం త్వరలో కూల్చివేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్టోన్ బిల్డింగ్ గా పిలవబడే ఈ చారిత్రాత్మక బిల్డింగ్ లో ప్రస్తుతం TSPDCL కు సంబంధించిన కార్యాలయాలు ఈ భవనంలో ఉన్నాయి. ఈ కట్టడం సెక్రెటేరియట్ కు వాస్తు సమస్య ఉన్న కారణంగా కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఈ నిర్మాణం1910లో నిజాం పాలనలో పూర్తిగా రాతితో నిర్మింపబడింది. సెక్రటేరియట్ అవుట్ గేట్ పక్కనే మింట్ కాంపౌండ్‌లో ఈ భవనం ఉంది. రాతి కట్టడమైన ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్రంలో నిర్మించిన తొలి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఈ భవనంలోనే ఉండేది. ఉస్మానియా టెక్నికల్‌ కాలేజ్‌ కూడా కొన్నాళ్లపాటు ఈ భవనంలోనే కొనసాగింది. ప్రస్తుతం ఉన్న TSPDCL సంబంధిత కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. మరోవైపు, నిర్మించి వందేళ్లు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు నగర ప్రజలు.