బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి

బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు : కిషన్ రెడ్డి

హైదరాబాద్: బై మిస్టేక్​లో  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని  కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. గాడిద అసలు గుడ్డు పెట్టదు కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టించారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు. అలాంటి ఆలోచన అసలు బీజేపీకి లేదదు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది’ అని కిషన్​అన్నారు.