గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్

గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది :  పురాణం సతీశ్ కుమార్

మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని  పలు గ్రామాల్లో  వంశీ తరపున జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం కాకా ఫ్యామిలీ కృషి చేస్తోందన్నారు. కాకా కుటుంబం ఏనాడు కమీషన్ల కోసం ఆశపడలేదని, వారు ప్రజాసేవ కోసం రాజకీయాల్లో ఉన్నారన్నారు. పదవులు ఉన్నా లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించారని చెప్పారు.  వంశీ గెలిస్తే యువతకు, నిరుద్యోగులకు వేలాది ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లీడర్ల మాయమాటలు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.