8 మంది అరెస్టు.. ఒకరి పరారీ
మంచిర్యాల, వెలుగు: అడవి అలుగును వేటాడి కోటిన్నరకు అమ్మే ప్రయత్నం చేస్తున్న వేటగాళ్లను టాస్క్ఫోర్స్పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్సీఐ కిరణ్ కుమార్తెలిపిన వివరాల ప్రకారం.. క్యాన్సర్వ్యాధుల మెడిసిన్లో అలుగు పొలుసు వాడతారని, చైనా మార్కెట్లో భారీ ధర పలుకుతుందన్న ప్రచారంతో 9 మంది కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సండ్రపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో వేటకు వెళ్లారు. అడవి అలుగును వేటాడి అమ్మే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, సిబ్బంది 8 మందిని పట్టుకున్నారు. వేటగాళ్ల నుంచి అడవి అలుగుతో పాటు మూడు బైక్లు, 8 సెల్ఫోన్స్, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.