అప్పటి వరకు నవ్వులు.. 20 సెకన్లలో తలకిందులు.. కళ్లెదుటే భార్యను మింగేసింది

అప్పటి వరకు నవ్వులు.. 20 సెకన్లలో తలకిందులు.. కళ్లెదుటే భార్యను మింగేసింది

విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది.  ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్  బీచ్ లో అలల ఉధృతికి జ్యోతి సోనార్(32) అనే మహిళ కొట్టుకుపోయింది. ఈ జంట అలలను షూట్ చేసేందుకు ఒక రాయిపైకి వెళ్లారు. వారు అక్కడున్న సమయంలో అలలు ఉధృతంగా వచ్చి వాళ్లను తాకాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పిల్లలను అక్కడే ఉంచి వెళ్లారు.  ముఖేష్ .. అతని భార్య జ్యోతి  ఒక రాయిపై ఉండి ఈ అలను షూట్ చేస్తున్న సమయంలో  వెనుకనుంచి వచ్చి బలంగా తాకాయి.  దీతంతో బ్యాలెన్స్ కోల్పోయి  ఇద్దరు సముద్రంలో పడిపోయే సమచంలో ...  ముఖేష్ అతని భార్య బట్టలను  పట్టుకున్నాడు. అయితే జ్యోతి మాత్రం సముద్రంలో కొట్టుకు పోయింది. 

తమ  కుటుంబం రెండు వారాల కొకసారి ఎంజాయి చేసేందుకు బయటకు వెళతామని  ముఖేష్ తెలిపాడు.   ముంబైలోని జుహుచౌపటీని సందర్శించాలని అనుకున్నారు.   బీచ్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల  కారణంగా. బాంద్రావైపు వెళ్లారు. బాంద్రా కోటలో ఫ్యామ్లీ  ఫొటోలు దిగేందుకు సముద్రం దగ్గరికి వెళ్లామని ముఖేష్ తెలిపాడు.  ముఖేష్ అతని భార్య కలిసి  సముద్రంలోకి వెళ్లారు.  ఒకరిపై మరొకరు నీరు చిమ్ముకుంటూ ఎంజాయి చేశారు.  పిల్లలు వస్తుంటే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున రావద్దని చెప్పారు. దూరం నుండి మమ్మల్ని చూస్తున్న మా పిల్లలు మా కోసం ఫోటోగ్రాఫ్‌లు క్లిక్ చేయడం ప్రారంభించారు. అప్పుడే ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. ఈ జంట సముద్రం మధ్యలో రాయిపై  నిలబడి ఉన్న వీడియో  సోషల్ మీడియాలో పోస్ట్ అయింది

ఇంతలో ఒక పెద్ద అల వారిని తాకడంతో  తడిసిపోయి.. ముఖేష్ భార్య జ్యోతి కొట్టుకుపోయింది. 'మమ్మీ' అంటూ పిల్లల విపరీతమైన కేకలు వేశారు. ముఖేష్ భార్య జ్యోతి తన  కళ్ల ముందే సముద్రంలో కొట్టుకుపోయిందని ముఖేష్  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.