
- గ్యాస్ కట్టర్ తో కట్ చేసి 15 నిమిషాల్లో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు
- సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఘటన
హుజూర్ నగర్, వెలుగు: ఫార్చునర్ కారులో వచ్చిన ఇద్దరు దొంగలు గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి ఓ దొంగ వెళ్లి గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తుండగా, మరో దొంగ షటర్ ను కిందకు దించి పరిసరాలను గమనించడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. పక్కా ప్లాన్ తో 15 నిమిషాల్లో ఏటీఎంను కట్ చేసి, అందులోని మనీ బాక్సులను బయటకు తీసుకొచ్చారు. నగదును బయటకు తీసుకురాగానే షటర్ మూసివేసి ఏటీఎం రూమ్ను తగలబెట్టి దుండగులు పరారయ్యారు. ఏటీఎంలో 2 రోజుల కింద రూ.20 లక్షలు పెట్టగా, ఆ డబ్బులన్నీ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చరమందరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.