ఉపఎన్నికల్లో గెలవాలని…TRS కుట్రలు చేస్తుంది : ఉత్తమ్

ఉపఎన్నికల్లో గెలవాలని…TRS కుట్రలు చేస్తుంది : ఉత్తమ్

హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని…TRS కుట్రలు చేస్తోందన్నారు PCC ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మట్టంపల్లి మండలంలో ఇసుక మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆరోపించారు. విధుల్లో ఉన్న VRA పై అధికార పార్టీ వాళ్లు దాడి చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికే….. కోదాడ, మట్టంపల్లిలో ఆంధ్రా అధికారులను నియమించారని ఆరోపించారు.