బాచుపల్లిలో దారుణం.. యువకుడిని చంపి ఇన్స్టాలో రీల్స్ చేసిన దుండగులు

బాచుపల్లిలో దారుణం.. యువకుడిని చంపి ఇన్స్టాలో రీల్స్ చేసిన దుండగులు

హైదరాబాద్ బాచుపల్లిలో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతీ నగర్ చెరువు కట్ట దగ్గర తేజస్(26) అనే యువకుడిని 2024 ఏప్రిల్ 7న అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు వెంటాడి మరీ దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత నిందితులు ఇన్ స్టాలో రీల్ పోస్ట్ చేశారు. తామే హత్య చేసినట్లు చూపిస్తూ.. డ్యాన్సులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.  

ఓ హత్య కేసులో తేజస్ నిందితుడిగా ఉన్నాడు. 2 నెలల క్రితమే జైలు నుంచి విడుదలైయ్యాడు. అయితే నిన్న అర్థరాత్రి సమయంలో తేజస్ ను ఇంటల్లో నుంచి బయటకి తీసుకెళ్లారు దుండగులు. ఆ తర్వాత సమీపంలో ఉన్న ప్రగతీ నగర్ చెరువు కట్ట దగ్గర 12 కత్తిపోట్లు పొడిచి, తలపై బండరాళ్లతో మోది హత్య చేసి.. అక్కడి నుంచి దుండగులు పరారైయ్యారు.

సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన రీల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఇలాంటి దారుణ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.