- ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వారం రోజుల్లో 363 టన్నుల ఆటో ఎల్పీజీని సమకూర్చి సరఫరా చేయడంతో పాటు మూతపడిన 17 ఔట్లెట్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుంటామని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర వెల్లడించారు. మంగళవారం ఆయన ఆటో ఎల్పీజీ సరఫరాపై ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఆటో ఎల్పీజీ సరఫరా అత్యంత కీలకమన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా ఎల్పీజీ సరఫరా కొనసాగించేందుకు అన్ని సంస్థలు కట్టుబడి ఉండాలన్నారు. సివిల్సప్లయ్స్ శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తూ రోజువారీగా ఔట్లెట్ల పని తీరును పరిశీలిస్తున్నదని తెలిపారు.
