48 గంటల ముందే సభలకు పర్మిషన్​ తీస్కోవాలి: కలెక్టర్ అనుదీప్

48 గంటల ముందే సభలకు పర్మిషన్​ తీస్కోవాలి: కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. గురువారం కలెక్టరేట్ లో వివిధ పార్టీల ప్రతినిధులు, ఏఆర్ఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి 25 వరకు కలెక్టరేట్​లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సీరియస్​యాక్షన్​ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, అడ్వటైజ్​మెంట్ల కోసం 48 గంటల ముందు అప్లికేషన్​పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే 1950 నంబర్​కు, సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.నాగేశ్వర్, సత్యనారాయణ, ఎం.మీనా, వి.ఎస్.భరద్వాజ, యమన్ సింగ్, కొల్లూరు పవన్ కుమార్, బీఆర్ఎస్ గగన్ యాదవ్, కాంగ్రెస్ పి.రాజేశ్​కుమార్, బి సతీశ్​గౌడ్, ఏఆర్ఓలు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గురువారం ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్​పాల్గొన్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కు 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కలెక్టర్​సూచించారు.