లోక్ సభ స్పీకర్ ప్రభుత్వానికంటే తక్కువ కాదు

లోక్ సభ స్పీకర్ ప్రభుత్వానికంటే తక్కువ కాదు

హైదరాబాద్: ప్రధాని మోడీ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సోమవారం కొత్తగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనంపై కాంస్యంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం విగ్రహాన్ని పీఎం మోడీ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ మోడీపై విమర్శలు గుప్పించారు.  ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని పార్లమెంట్ మీద ఉన్న జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించకూడదన్నారు. పార్లమెంట్, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం వేరు వేరు అధికారాలనిచ్చిందని తెలిపారు. రాజ్యాంగ్య పోస్ట్ అయిన లోక్ సభ స్పీకర్ ప్రభుత్వాని కంటే తక్కువ కాదని స్పష్టం చేశారు.