15న బీడీ కార్మికుల చలో హైదరాబాద్

15న బీడీ కార్మికుల చలో హైదరాబాద్

హైదరాబాద్, వెలుగు: బీడీ కార్మికులకు, ఇతర సిబ్బందికి ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఈ నెల 15న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రాములు తెలిపారు. ఇందిరాపార్కు వద్ద బీడీ కార్మికుల ఆకలి కేక మహాధర్నా చేస్తున్నట్టు చెప్పారు. 

ఆదివారం హైదరాబాద్​లోని బీఎల్​ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బీఎల్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్​తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.  బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు నెలకు రూ.2,016 భృతి ఇస్తామనీ సీఎం ఇచ్చిన హామీ  అమలు చేయలేదన్నారు.