
హైదరాబాద్, వెలుగు: బీడీ కార్మికులకు, ఇతర సిబ్బందికి ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఈ నెల 15న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రాములు తెలిపారు. ఇందిరాపార్కు వద్ద బీడీ కార్మికుల ఆకలి కేక మహాధర్నా చేస్తున్నట్టు చెప్పారు.
ఆదివారం హైదరాబాద్లోని బీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు నెలకు రూ.2,016 భృతి ఇస్తామనీ సీఎం ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు.