దీన్ని వదల్లేదా : తెలంగాణ మిడ్ డే మీల్ పేరుతో బీఆర్ఎస్ లీడర్ రూ.5 కోట్ల చీటింగ్

దీన్ని వదల్లేదా : తెలంగాణ మిడ్ డే మీల్ పేరుతో బీఆర్ఎస్ లీడర్ రూ.5 కోట్ల చీటింగ్

బీఆర్ఎస్ నేతల అక్రమ దందాలు,స్కాంలు రోజుకో చోట బయటపడుతున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ఇలా మండల స్థాయి లీడర్ల వరకు వారు చేసిన భూ ఆక్రమణలు, ప్రభుత్వ పథకాల్లో దోపిడి భాగోతాలు భయటపడుతున్నాయి. ప్రజావాణిలో రోజుకో బీఆర్ఎస్ నేతపై కంప్లైంట్లు ఇస్తున్నారు బాధితులు. ఇవి గాకుండా బడా నేతల పేరు చెప్పి పలువురి దగ్గర కోట్లు దండుకున్న నేతలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. లేటెస్ట్ గా మిడ్ డే మీల్స్ పేరుతో బెంగళూరు కంపెనీకి రూ. 5 కోట్లు మోసం చేసిన బీఆర్ఎస్ నేతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అప్పగిస్తామని వారి నుంచి  రూ,5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

నకిలీ జీవోలు చూపెట్టి తమ నుంచి డబ్బులు తీసుకుని..  తర్వాత  కనిపించకుండా తిరుగుతున్నారని బాధితులు హైదరాబాద్ పోలీసులును ఆశ్రయించారు. దీంతో  అరవింద్ ను అదుపులోకి తీసుకున్నారు.  అరవింద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యక్రమాలను చూస్తుంటారని సమాచారం. ఇతను కేటీఆర్, కవితలకు అభిమాని.