సౌండ్ ఎక్కువ చేస్తున్న సైలెన్సర్లను పీకేసిన్రు

సౌండ్ ఎక్కువ చేస్తున్న సైలెన్సర్లను పీకేసిన్రు

హైదరాబాద్​ సిటీలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేసే సైలెన్సర్లు ఉన్న బండ్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నరు.  కొంతమంది కావాలనే రకరకాల సౌండ్స్ ఇచ్చే సైలెన్సర్లతో జనాన్ని ఇబ్బంది పెడుతుండడంతో వాటిని పీకేసిన్రు. శనివారం కేబీఆర్ పార్క్ వద్ద సిటీ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసి అవేర్ నెస్ ప్రోగ్రామ్ చేపట్టిన్రు. ఇందులో భాగంగా ఇలా సౌండ్ ఎక్కువ చేస్తున్న బైక్ లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తీసేసిన్రు. ఇకపై ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేసే వెహికల్స్ మొదటిసారి పట్టుబడితే రూ. వెయ్యి, రెండోసారి దొరికితే రూ.2 వేలు ఫైన్ వేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పినరు. ‌‌‌‌

రంజీ రద్దు..87 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి