T20 World Cup 2026: మార్చి 5న ఇంగ్లండ్తో టీమిండియా సెమీ ఫైనల్.. కానీ అదొక్కటే భయం !

T20 World Cup 2026: మార్చి 5న ఇంగ్లండ్తో టీమిండియా సెమీ ఫైనల్.. కానీ అదొక్కటే భయం !

టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా.. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోబోతోంది. మార్చి 5న ఇంగ్లండ్తో టీమిండియా తలపడుతుంది. మార్చి 4న న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది.

సెమీ ఫైనల్ వన్లో గెలిచిన టీం, సెమీ ఫైనల్ 2లో గెలిచిన టీం.. మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. 50 బంతుల్లో 4 సిక్సులు, 12 ఫోర్లతో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచినప్పటికీ సంజూ శాంసన్ చేసిన 97 పరుగులు అతనిపై వచ్చిన విమర్శలకు వంద శాతం సమాధానమిచ్చాయి.

ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ వేళ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన ఒక్కటే టీమిండియాను కలవరపెడుతుంది. సంజూ శాంసన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా సెమీస్ గండం కూడా గట్టెక్కే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ కచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో ఒకరు నిలబడి కలబడటం ప్రతీ మ్యాచ్లో సాధ్యపడే అంశం కాదు. టీమిండియా బౌలింగ్ పరంగా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్  జట్టు కూడా మరీ అంత ఆషామాషీ టీం అయితే కాదు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హిట్టర్లు ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను వీలైనంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.