ఫినో బ్యాంకు CEO రిషి గుప్తా అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్టు..

ఫినో బ్యాంకు CEO రిషి గుప్తా అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ విధించిన హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్టు..

ఫినో పేమెంట్స్ బ్యాంకు సీఈఓ రిషి గుప్తను అరెస్ట్ చేసింది DGGI. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ లో భాగంగా రిషి గుప్తాను అదుపులోకి తీసుకున్న DGGI హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్టు హాజరుపరచగా.. రిషి గుప్తాకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఫినో పేమెంట్స్ బ్యాంకు ద్వారా అలైన్ గేమింగ్ నిర్వహణ లో GST ఎగ్గొటిన్నట్టు గుర్తించింది DGGI. ఈ స్కాంలో 13వేల కోట్ల రూపాయల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్టు గుర్తించారు అధికారులు.

13 వేల కోట్ల స్కాంలో ఫినో బ్యాంక్ ద్వారా 3 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.  ఫినో బ్యాంకు 840 కోట్లు రూపాయలు ట్యాక్స్ ఎగొట్టినట్లు తెలిపారు అధికారులు. 

ఈ పరిణామాల క్రమంలో స్టాక్ ఎక్చేంజ్ కు వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు. ఈ వ్యవహారం బిజినెస్ పాట్నార్లకి సంబంధించినది కానీ.. బ్యాంక్ కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు.

ఈ క్రమంలో ఫినో బ్యాంక్ CFO గా ఉన్న కేతన్ మర్చంట్ ను తాత్కాలిక CEO గా నియమించింది ఫినో బ్యాంకు. సీఈఓ రిషి గుప్తా అరెస్టుతో ఫినో బ్యాంకు షేర్లు 7.5శాతం పడిపోయాయి.