- ముంబై లియోన్ ఆర్మీతో టైటిల్ ఫైట్
ముంబై: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)లో హైదరాబాద్ స్ట్రయికర్స్ ఫైనల్కి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్లో హైదరాబాద్ 42–38తో చెన్నై స్టాలినోస్పై గెలిచింది. సెకండ్ సెమీస్లో ముంబై లియోన్ ఆర్మీ కూడా ఇదే స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్స్ పుణె జాగ్వార్స్ను ఓడించింది. రెండు మ్యాచ్లూ 30–30 స్కోరు వద్ద టై కాగా, మెన్స్ డబుల్స్ విక్టరీస్తో స్ట్రయికర్స్, ముంబై విన్నర్స్గా నిలిచాయి. స్ట్రయికర్స్ తరఫున విమెన్స్ సింగిల్స్లో కర్మన్ కౌర్ 11–9తో సమంతా శరన్ను ఓడించి శుభారంభాన్ని ఇచ్చింది. కానీ మెన్స్ సింగిల్స్లో అర్జున్ ఖడే 4–8తో సిద్ధార్థ్ (చెన్నై) చేతిలో ఓడాడు. లాస్ట్లో జరిగిన డబుల్స్ మ్యాచ్లో అర్జున్ ఖడే–విష్ణువర్ధన్ 12–8తో పురవ్ రాజా–సిద్ధార్థ్ రావత్ (చెన్నై)ను ఓడించి విక్టరీ అందించారు. ముంబై ఆట కూడా ఇదే తరహాలో సాగింది. లాస్ట్లో జరిగిన మెన్స్ డబుల్స్లో నిక్కీ పూంచా–రామ్ కుమార్ (ముంబై) 12–8తో సాకేత్–ఇక్బాల్ (పుణె)పై గెలిచారు.