ఓయూ నుంచి లాలాపేట్ వైపు వెళ్లేటోళ్లకు అలర్ట్.. ఫ్లై ఓవర్ కిందుండే.. తార్నాక జంక్షన్ మళ్లీ మూసేశారు..!

ఓయూ నుంచి లాలాపేట్ వైపు వెళ్లేటోళ్లకు అలర్ట్.. ఫ్లై ఓవర్ కిందుండే.. తార్నాక జంక్షన్ మళ్లీ మూసేశారు..!

సికింద్రాబాద్: తార్నాక జంక్షన్ను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు ప్రకటించారు. కొన్ని రోజుల పాటు ప్రయోగాత్మకంగా జంక్షన్ను ఓపెన్ చేశారు. అయితే జంక్షన్ ఓపెన్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగినట్టుగా తమ పరిశీలనలో తేలిందని అధికారులు స్పష్టం చేశారు. ఆధునిక పద్ధతులలో తమ పరిశీలన కొనసాగినట్లుగా వివరించారు. జూన్ 6 నుంచి మూసివేత అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. జంక్షన్ మూసివేతతో మళ్ళీ గతంలో లానే జంక్షన్ దాటడానికి యూ టర్న్లు తీసుకోవాల్సి ఉంటుందని ప్రయాణికలు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ ​మేనేజ్​మెంట్లో భాగంగా తార్నాకలో బంద్​చేసిన జంక్షన్ను ట్రాఫిక్​పోలీసులు ఏప్రిల్లో మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ యూ టర్న్​చాలా దూరం ఉండడం, ట్రాఫిక్​జామ్కు కారణం అవుతుండడంతో కొంతకాలం తార్నాక జంక్షన్​తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రయల్​రన్లో భాగంగా జంక్షన్​మధ్యలో ఉన్న డివైడర్లను తెరిచి మునుపటిలా వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు. ఈ ట్రయల్​రన్15 రోజుల పాటు అమలు చేశారు.

మెట్టుగూడ నుంచి వచ్చేవారు ఓయూ రూట్లోకి, హబ్సిగూడ నుంచి వచ్చేవారు లాలాపేట్​వైపు వెళ్లడానికి పర్మిషన్​ఇవ్వలేదు. వీరు మునుపటి లాగానే యూ టర్న్​తీసుకుని వెళ్లారు. ఉస్మానియా వర్సిటీ నుంచి లాలాపేట్, హబ్సిగూడ వైపు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. లాలాపేట్​నుంచి వచ్చేవారికి మాత్రం ఓయూలోకి, సికింద్రాబాద్​వైపు వెళ్లేలా పర్మిషన్​ఇచ్చారు. అయితే.. తార్నాక జంక్షన్ను ఓపెన్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిందని తేలడంతో తార్నాక జంక్షన్ను మూసేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.