సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

 సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌ కు ఒక నెల జైలు శిక్ష విధించారంటూ  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  ఖండించారు. 

తనపై ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని , కావాలనే కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు.   వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని,  ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు.