లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా

లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదు: కాంగ్రెస్ పై మాండవీయా

కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని లేకపోతే యాత్రను ఆపివేయాలని తాను రాసిన లేఖ పై కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పారు. తాను ఒక ఆరోగ్య మంత్రిని అని.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నియమాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియలో తన పర్యవేక్షణ పూర్తిగా ఉంటుందని చెప్పారు. కరోనా వ్యాప్తి పై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు తనకు లేఖ రాశారని ఆయన అన్నారు. ఇక భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ వంటి కాంగ్రెస్‌ నేతలు కరోనా బారినపడ్డారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి లేఖ పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.