సీజన్ 13 ఐపీఎల్ లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీని గెలిచారు. అయితే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 11వ ఓవర్లో రోహిత్ కారణంగా సూర్యకుమార్ యాదవ్ రనౌట్ గా వెనుదిరగాడు. అశ్విన్ బౌలింగ్ లో బంతిని చూడకుండా సింగిల్ కోసం రోహిత్ శర్మ సూర్యకుమార్ ను పిలిచాడు కానీ అతడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉండిపోయాడు. అయితే సూర్య తన వికెట్ వదులుకున్నాడు.
దీనిపై మ్యచ్ విన్నింగ్ తర్వాత స్పందిచన రోహిత్ సూర్యకుమార్ తన తప్పిదం వల్లే ఓటయ్యాడని అన్నాడు. ‘ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ కోసం నా వికెట్ వదులు కోవాల్సింది కానీ నా కోసం తానే ఔటయ్యాడు. ఈ సీజన్ అతను చాలా అద్భుతంగా ఆడాడు. రాహుల్ ప్రణాళికలో భాగంగానే ఇవాళ ఆడలేదు. అంతేగానీ తాను ఎలాంటి తప్పుల చేయలేని చెప్పాల్సిన అవసరముంది. ఈ విక్టరీ మా జట్టు సిబ్బందికి, యాజమాన్యానికి ఈ క్రెడిట్ దక్కుతుందన్నాడు. దురదృష్టవశాత్తు ఈ మైదానాంలో అభిమానులు లేరు. వాంఖడేలో ఆడకపోవడం భాదగా ఉంది. వచ్చే ఏడాదైనా ఆడాలని కోరుకుంటున్నా‘ అని రోహిత్ అన్నాడు.
Un-selfish @surya_14kumar ❤ pic.twitter.com/oUOG0xVMXg
— Dhoni Tharane 2⃣ ˢᵒᵒʳᵃʳᵃⁱ ᵖᵒᵗᵗʳᵘ (@Tharane_twetz) November 10, 2020