రామ మందిరంలో ఒట్టేసి చెప్తా : వంశీచంద్ రెడ్డి 

రామ మందిరంలో ఒట్టేసి చెప్తా : వంశీచంద్ రెడ్డి 
  •      కాంగ్రెస్ నుంచి పోటీకి డీకే అరుణ డబ్బులు అడిగారు: వంశీచంద్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి డీకే అరుణ అవకాశవాద రాజకీయాలకు మారుపేరు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలిచినా ఆయన పార్టీలో అరుణ చేరిపోతారన్నారు. శుక్రవారం గాంధీభవన్​లో మీడియాతో వంశీచంద్ మాట్లాడారు. 2019లో రూ.15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి మహబూబ్​నగర్ ఎంపీగా పోటీ చేస్తానంటూ డీకే అరుణ చెప్పారని ఆరోపించారు. అరుణ డబ్బులు అడిగిందని చెప్పేందుకు తాను ఏ రామ మందిరంలోనైనా ప్రమాణానికి సిద్ధమన్నారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు మహబూబ్​నగర్​ టీచర్స్ కాలనీలోని రామ మందిరానికి వస్తానని సవాల్ విసిరారు. అప్పుడు అసలైన రామభక్తులు ఎవరో తేలుతుందన్నారు.