భారీ మెజార్టీతో గెలిచి.. మళ్లీ లోక్​సభకు వస్త : మహువా మొయిత్రా

భారీ మెజార్టీతో గెలిచి.. మళ్లీ లోక్​సభకు వస్త :  మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి, మళ్లీ లోక్ సభలో అడుగుపెడతానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సులపై శుక్రవారం ఆమె స్పందించారు. ‘‘పార్లమెంట్ చరిత్రలో ఎథిక్స్ కమిటీ ద్వారా అనైతికంగా బహిష్కరణకు గురైన మొదటి ఎంపీగా నిలిచినందుకు గర్వంగా ఉంది. ముందు బహిష్కరించండి. ఆ తర్వాత ఆధారాల కోసం సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరండి. కంగారూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇది” అని మహువా ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ‘‘అదానీ.. నాకు ఈసారి టికెట్ రాదని అందరికీ చెబుతూ మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి. నా టికెట్ కట్ కాదు.. మీ మార్కెట్ క్యాపిటల్ మాత్రమే కట్ అవుతుంది” అని బిజినెస్ మెన్ గౌతమ్ అదానీని ఉద్దేశించి పోస్టు చేశారు. మళ్లీ కృష్ణానగర్ నుంచి బరిలో నిలిచి, డబుల్ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.