కేఎల్ రాహుల్ కు జరిమానా విధించిన ఐసీసీ

కేఎల్ రాహుల్ కు జరిమానా విధించిన ఐసీసీ

ఓవల్: బారత బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కు ఐసీసీ జరిమానా విధించింది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో అంపైర్ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. మొదటి తప్పిదంగా భావిస్తూ మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్ల ప్రకటించింది. నాలుగో టెస్టు మూడో రోజు తొలి సెషన్ లో అండర్సన్ వేసిన 33వ వర్ లో కేఎల్ రాహుల్ (46) కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సమీక్ష కోరాడు. టీవీ రీప్లే సమీక్షలో రాహుల్ ఔట్ అయినట్లు తేలింది. దీంతో రాహుల్ తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు.