టీమిండియాను ఆపడం అంత ఈజీ కాదు

టీమిండియాను ఆపడం అంత ఈజీ కాదు

న్యూఢిల్లీ: టీమిండియా తన ఫామ్ ను కొనసాగిస్తే ఆపడం ఎవరి తరమూ కాదని భారత స్పీడ్ స్టర్ మహ్మద్ షమీ అన్నాడు. గత ఆరు నెలలుగా టీమిండియా అద్భుతంగా ఆడుతోందని, ఇంగ్లాండ్ టూర్ లోనూ ఇదే ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. 

'కొత్తగా ప్లాన్ చేయడానికి ఏమీ ఉండదు. ఏదైనా ఎక్కువగా ప్లాన్ చేసినా అది మన చేతిలో ఉండదు. కరోనా మహమ్మారి ఇలా వచ్చి మనందరి జీవితాల్లో రెండు సంవత్సరాలను నాశనం చేస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. అందుకే ఏ సీరీస్ కు ఆ సిరీస్ ను వేర్వేరుగా ప్రణాళిక రచిస్తూ ఆడాలి' అని షమి పేర్కొన్నాడు. ఐపీఎల్ తో తాను మళ్లీ మంచి రిథమ్ లోకి వచ్చానని.. తాను నేర్చుకన్న విషయాలు, అనుభవాన్ని యువకులకు పంచుతానని వివరించాడు.

మరిన్ని వార్తలు