కేసీఆర్కు మరో అవకాశమిస్తే సర్వనాశనం

 కేసీఆర్కు మరో అవకాశమిస్తే సర్వనాశనం

ఖమ్మం జిల్లా: మరోసారి కేసీఆర్ కు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం  చేస్తారన్నారు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.   ఉద్యకారుడని నమ్మి ప్రజలు కేసీఆర్ కు పగ్గాలిస్తే .. అన్ని వర్గాలను నిండా ముంచారని ఆమె మండిపడ్డారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మడుపల్లిలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా రాష్ట్రంలో కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగిందని దుయ్యబట్టారు.

కేసీఆర్ వల్ల ఏ ఒక్కరికైనా.. న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. దాదాపు 30వేలు వచ్చే పథకాలన్నిటికీ బందుపెట్టి కేవలం 5వేలు వచ్చే రైతు బంధు మాత్రమే ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని షర్మిల విమర్శించారు. తప్పులు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మొద్దు నిద్రపోతున్నాయని, అమ్ముడుపోయాయని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడే లేడని తాము పార్టీ పెట్టామన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొచ్చి ప్రజారంజకంగా పాలిస్తామని షర్మిల హామీ ఇచ్చారు.