కేసీఆర్‌ అందుబాటులో లేకనే.. అపెక్స్‌ మీటింగ్ వాయిదా

కేసీఆర్‌ అందుబాటులో లేకనే.. అపెక్స్‌ మీటింగ్ వాయిదా

రెండు రాష్ట్రాలకు లెటర్ రాసిన కేంద్ర జల శక్తి శాఖ
ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం కేసీఆర్ అందుబాటులోలేకే అపెక్స్ ‌కౌన్సి ల్ మీటింగ్ వాయిదా వేశామని కేంద్ర జలశక్తిశాఖ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కృష్ణా ,గోదావరి బోర్డుల చైర్మన్లకు లేఖ రాసింది. రెండు రాష్ట్రా ల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు బుధవారం అపెక్స్ ‌‌కౌన్సి ల్ ‌మీటింగ్ నిర్వహిస్తున్నట్టు గతంలోనే కేంద్రం రెండు రాష్ట్రాల‌ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది. కేసీఆర్‌‌కు ఆరోజు కార్యక్రమాలు ఉండటంతో సమావేశం వాయిదా వేయాలని కేంద్రానికి సీఎస్‌ లెటర్ రాశారు. దీంతోసమావేశం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చెప్తామని లేఖలో కేంద్రం పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం