వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్ కంట్రోల్ కాకపోతే టోక్యో ఒలింపిక్స్పూర్తిగా రద్దవుతాయ ని గేమ్స్ఆరనై్గ జింగ్కమిటీ ప్రెసిడెంట్యోషిరో మోరీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఏడాది వాయిదా పడ్డ గేమ్స్ను మరోసారి పోస్ట్పోన్ చేసే చాన్స్ లేదని స్పష్టం చేశారు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దు చేశారు. కానీ ఇప్పుడు వరల్డ్మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నది. ఇందులో మనం గెలవకపోతే అన్ని ఇబ్బందులే. ఒకవేళ వైరస్ను పూర్తిగా కట్టడి చేస్తే వచ్చే సమ్మర్లో ఒలింపిక్స్ను నిర్వహిస్తాం. లేకపోతే కంప్లీట్ గా రద్దవుతాయి.’ అని మోరీ పే ర్కొన్నారు. అయితే మోరీ వ్యాఖ్యలు ఆయన సొంత ఆలోచనలని గేమ్స్ స్పోక్స్ పర్సన్ టకయా వెల్లడించా రు. రీ షెడ్యూల్ప్రకారమే ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. గేమ్స్ను ఏడాది పోస్ట్పోన్చేయడంతో అటు అథ్లెట్లు, ఇటు ఐఓసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొం టున్న నేపథ్యంలో.. ఆలస్యమైనా ఒలింపిక్స్ను ని ర్వహిస్తేనే బాగుంటుందని గేమ్స్నిర్వాహకులు, జపాన్ గవర్నమెంట్ భావిస్తున్నది. వ్యాక్సిన్ వచ్చాకే.. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టకపోతే గేమ్స్నిర్వహణ సాధ్యం కాదని జపాన్మెడికల్ అసోసియేషన్హెడ్యోషిటెక్యోకోకురా స్పష్టం చేశారు. ‘గేమ్స్వద్ద ని మేం చెప్పడం లేదు. కానీ అనువైన పరిస్థితులు లేకపోయినా ఒలింపిక్స్ను నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నది. వీలైనంత త్వరగా కరోనాకు వ్యాక్సిన్ , డ్రగ్అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. వస్తే అందరి ఇబ్బం దులు తొల గిపోతాయి. జపాన్లో కరోనా కంట్రోల్లోకి వచ్చినా గేమ్స్నిర్వహణ కష్టమే. ఎందుకంటే రెస్టాఫ్ వరల్డ్మొత్తం మళ్లీ ఇక్కడికి వస్తారు. అప్పుడు ఇన్ఫెక్షన్స్బెడద మళ్లీ పెరిగిపోతుంది. అందుకే వరల్డ్వైడ్గా కరోనా కంట్రోల్లోకి రావాలి’ అని యోకోకురా పేర్కొన్నారు. ఇక కరోనా నివారణ కోసం జపాన్తీసుకుంటున్న చర్యలు నిరాశాజనకంగా ఉన్నాయని మరికొంత మంది ఎక్స్పర్స్ ట్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఒలింపిక్స్నిర్వహణపై మెడికల్ఎక్స్ప ర్స్ ట్ఇలా మాట్లాడటం చాలా తొందరపాటు చర్య అని టకయా అన్నారు. అలాంటి పరిస్థితులు వస్తా యని ఇప్పుడే అనడం సరైంది కాదన్నా రు.