ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోల అలజడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోల అలజడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల అలజడి మొదలైంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా పెద్దఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో తప్పించుకున్న మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ దళం ప్రవేశించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.

ఏజెన్సీలో కొత్త రిక్రూట్ మెంట్ దిశగా భాస్కర్ దళం ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కర్ దళంలో ఒక్కొక్కరిపై రూ.5 నుంచి 20లక్షల రివార్డు ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరైనా మావోయిస్టులకు సహకరించినా, భోజనం పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.