సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. పలు ఇంట్రస్టింగ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. అంతే కాదు దాంతో పాటు ఓ చక్కని సందేశాన్ని కూడా ఇస్తోంది. ప్రకృతిని మనం ఎంత బాగా చూసుకుంటే.. అది మనల్ని అంతే బాగా కాపాడుతుందన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ వీడియోలో.. ఓ ముగ్గురు వ్యక్తులు చెట్టును నరికేయడాన్ని గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఆ చెట్టు ఓ వైపుగా విరిగి.. అక్కుడున్న వ్యక్తుల్లో ఒకరిని ఎత్తి మరో పక్కకు పడేస్తుంది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా... మీరు చెట్లను నరికేస్తారేమో గానీ.. వాటిని కింద పడేయలేరనే క్యాప్షన్ ను జతచేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుటుంది.
If you cut down trees, they won’t take it lying down ??????pic.twitter.com/TekNZiQSTF
— anand mahindra (@anandmahindra) August 23, 2022