హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం నాటికి దాదాపు1,700కు పైగా గణపతి విగ్రహాలు నిమజ్జనం అయ్యాయన్నారు.
రాజేంద్రనగర్లోని పత్తికుంట చెరువు వద్ద జరుగుతున్న గణనాథుల నిమజ్జనాన్ని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెరువులు, పాండ్స్ వద్ద ప్రత్యేకమైన రెయిలింగ్ ఏర్పాటు చేశామన్నారు.