శివరాత్రి రోజు రుద్రాభిషేకం ఎలా చేయాలంటే....

శివరాత్రి రోజు రుద్రాభిషేకం ఎలా చేయాలంటే....

మహా శివరాత్రి పవిత్ర పండుగ శివునికి అంకితం చేయబడింది. ఆ ( మార్చి 8)  రోజున భక్తులు నిర్మలమైన భక్తితో శివుని పూజించి శివలింగానికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం చాలా ముఖ్యమైనది. రుద్రాభిషేకం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.  శివ రాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం వలన కలిగే విశేష ఫలితాలను గురించి తెలుసుకుందాం..

రుద్రాభిషేకంలో ఏ పదార్థాలు ఉపయోగించాలంటే...

శివయ్య పూజలో ఆవు నెయ్యి, గంధం, తమలపాకులు, ధూపం, పువ్వులు, తమలపాకు, కర్పూరం, తీపి పదార్థాలు, పండ్లు, తేనె, పెరుగు, పాలు, డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్, పంచామృతం, చెరకు రసం, కొబ్బరి నీరు, గంధపు నీరుని ఉపయోగించాలి. ముఖ్యంగా గంగాజలం, నీరు, తమలపాకు, కొబ్బరి మొదలైనవి కావాలి. అయితే మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ఆవు కొమ్ముతో చేసిన అభిషేకం కోసం శృంగి అనే పాత్రతో రుద్రాభిషేకం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. 

  • మహాశివరాత్రి రోజున శివునికి రుద్రాభిషేకం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్ముతారు. మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం, శివ మంత్రాలను పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.
  • ఇంట్లో రుద్రాభిషేకం చేయడానికి, శివలింగాన్ని ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోండి. అదే సమయంలో రుద్రాభిషేకం చేసే సాధకుడి ముఖం తూర్పు వైపు ఉండాలి. అభిషేకం చేయడానికి శృంగిలో గంగాజలం పోసి అభిషేకాన్ని ప్రారంభించాలి. అనంతరం శివయ్యకు శృంగిలో చెరకు రసం, తేనె, పెరుగు, పాలు, పంచామృతంతో సహా అన్ని ద్రవాలతో శివలింగానికి అభిషేకం చేయండి.
  • శివునికి అభిషేకం చేసేటప్పుడు మహా మృత్యుంజయ మంత్రం, శివ తాండవ స్తోత్రం, ఓం నమః శివాయ లేదా రుద్ర మంత్రం వంటి ఏదైనా శివుని మంత్రాన్ని జపించాలి. మహా శివరాత్రి రుద్రాభిషేక ప్రక్రియ మొత్తం శివ మంత్రాలను పఠించడం చాలా శ్రేయస్కరం. ఇప్పుడు శివలింగంపై గంథాన్ని పూయండి. శివలింగానికి తమలపాకులు మొదలైన వాటిని సమర్పించండి.
  • ఇప్పుడు శివుడికి పండ్లు, ఇతర పదార్ధాలను నైవేద్యంగా సమర్పించండి. అనంతరం శివునికి సంబంధించిన ఏదైనా మంత్రాన్ని 108 సార్లు జపించి.. ఆపై కుటుంబ సమేతంగా శివునికి హారతిని ఇవ్వండి. ఇప్పుడు శివుడుని ప్రతిష్ఠించిన చోట నీటితో ఇంటి చల్లి, ఆ నీటిని అందరికీ ప్రసాదంగా త్రాగడానికి ఇవ్వండి.

రుద్రాభిషేకం  ప్రాముఖ్యత

జాతకంలో ఉన్న కాలసర్ప దోషం నుంచి బయటపడటానికి రుద్రాభిషేకం చాలా ప్రయోజనకరమని పండితులు చెబుతున్నారు.  శివుని అనుగ్రహంతో గ్రహ దోషాలు కూడా శాంతించి సాధకుడు జీవితంలో పురోగమిస్తాడు. శత్రువులపై విజయం సాధించాలనుకుంటే లేదా ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే.. రుద్రాభిషేకం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సంతోషం, శాంతి, సంపద, ఆస్తి, కీర్తి మొదలైన వాటిని పొందేందుకు రుద్రాభిషేకం కూడా చేస్తారు.

కొత్త ఇల్లు లేదా వాహనం కోసం:  మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలనుకుంటే పెరుగుతో రుద్రాభిషేకం చేయండి.

సంపద కోసం: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలని, ఐశ్వర్యం పెరగాలంటే తేనె, నెయ్యితో రుద్రాభిషేకం చేయాలని నమ్మకం.

గ్రహ దోష నివారణకు: జాతకంలో గ్రహ దోష నివారణకు గంగాజలంతో, ఇంట్లోని కష్టాలు తొలగాలంటే పెరుగుతో రుద్రాభిషేకం చేయాలి.
శాంతి, ఆనందం కోసం: సంతోషం, శాంతి కోసం శివునికి పాలతో రుద్రాభిషేకం చేయాలి.

సంతానం కోసం:  సంతానం కలగాలంటే ఆవు పాలలో లేదా నీళ్లలో పంచదార కలిపి రుద్రాభిషేకం చేయాలి.
శత్రువులను జయించడానికి: శత్రువులపై విజయం సాధించాలంటే భస్మం లేదా ఆవనూనెతో రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు వలన కలిగే దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.