ఆదాయం పెంచండి..సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలి: డిప్యూటీ సీఎం భట్టి

ఆదాయం పెంచండి..సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మంచి సంకేతం
  • నాన్‌‌ట్యాక్స్‌‌ రెవెన్యూ, కేంద్ర నిధులపై దృష్టిపెట్టండి 
  • ప్రజలపై ఎలాంటి భారం మోపొద్దని అధికారులకు ఆదేశం
  • రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 36 వేల కోట్ల పనులు జరుగుతున్నయ్​
  • సంక్షేమానికి ఇప్పటికే రూ.33,600 కోట్లు కేటాయించినట్టు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజలపై భారం మోపకుండా నాన్‌‌ట్యాక్స్​ రెవెన్యూ పెంచడంతో పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని సూచించారు. ఆదివారం సెక్రటేరియెట్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన నిధుల సమీకరణ, మౌలిక వసతుల కల్పన, పెండింగ్ ​పనులపై మంత్రుల కమిటీ సమావేశమైంది. 

ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పథకాలను ఆపకుండానే, కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతు భరోసా, ఉచిత కరెంట్, ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. 

2023–--24 ఆర్థిక సంవత్సరంలో ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్, ఎక్సైజ్ ఆదాయాలు తగ్గినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకు ఇప్పటికే రూ.33,600 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.  రాష్ట్రవ్యాప్తంగా 35,732 చోట్ల పనులు కొనసాగుతుండగా అందుకు రూ.లక్షా 36 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి తెలిపారు.

పెండింగ్ ​ప్రాజెక్టులు పూర్తి చేయండి.. ​

అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను ప్రాధాన్యతల ఆధారంగా వెంటనే పూర్తి చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు. ‘‘అన్ని శాఖలకూ బడ్జెట్ నిధులు సమానంగా అందాలి. రాష్ట్ర అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాలు, ప్రాముఖ్యత‌‌‌‌‌‌‌‌ల మేర‌‌‌‌‌‌‌‌కు నిధుల‌‌‌‌‌‌‌‌ను ఖ‌‌‌‌‌‌‌‌ర్చు చేయాలి. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్​ఖ‌‌‌‌‌‌‌‌ర్చుల‌‌‌‌‌‌‌‌ను తగ్గించుకుని, ప్రాధాన్యతల అధారంగా ముందుకు వెళ్లాలి. 

ఆదాయం తీసుకొచ్చే డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లపై సీరియ‌‌‌‌‌‌‌‌స్‌‌‌‌‌‌‌‌గా  దృష్టి సారించాలి” అని అధికారులకు సూచించారు. పది రోజుల్లో రేషనలైజేషన్​ ప్రక్రియను పూర్తి చేసి, సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు. 

భూముల వేలంపై త్వరలో నిర్ణయం? 

రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే నాన్-ట్యాక్స్ రెవెన్యూ పెంచడంపై సీరియస్‌‌‌‌‌‌‌‌గా దృష్టి సారించాలని అధికారులను భట్టి ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సాధించుకోవాలని సూచించారు. ‘‘ప్రతిసారీ నాన్‌‌‌‌‌‌‌‌ట్యాక్స్ రెవెన్యూ లక్ష్యం ఎక్కువగా పెట్టుకుంటున్నప్పటికీ.. వస్తున్నది మాత్రం చాలా తక్కువగా ఉంటున్నది. ఈసారి నాన్‌‌‌‌‌‌‌‌ట్యాక్స్​ రెవెన్యూ కనీసం 80 శాతం వచ్చేలా ప్రణాళికలు అమలు చేయాలి” అని చెప్పారు. 

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్​ క్రమంగా పుంజుకుంటున్నదని, ఇది మంచి సంకేతమని అన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల వేలంతో పాటు ఇంకా ఏ రూపంలో నిధులు సమీకరించుకోవచ్చనే దానిపై ప్రపోజల్స్​ రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 

కాగా, నాన్‌‌‌‌‌‌‌‌ట్యాక్స్​ రెవెన్యూలో ప్రభుత్వ భూముల వేలం, లీజు ఇతరత్రా వంటివి ఉన్నాయి. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యుత్​శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్​మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.