బంకులో కల్తీపెట్రోల్ బంకును సీజ్​ చేయాలని ధర్నా

బంకులో కల్తీపెట్రోల్ బంకును సీజ్​ చేయాలని ధర్నా

నెక్కొండ, వెలుగు : వరంగల్​జిల్లా నెక్కొండ పట్టణంలో గల దుర్గా  పెట్రోల్​  బంకులో కల్తీపెట్రోల్​ అమ్ముతున్నారని,  బంకును సీజ్​చేయాలంటూ వాహనదారులు వరంగల్​-నెక్కొండ మెయిన్​రోడ్డుపై ధర్నాచేశారు. సోమవారం సుమారు 30  మంది పెట్రోలు పోసుకొని వెళ్లగా..  వరంగల్​, తొర్రూరుకు  వెళ్లే మార్గమధ్యలోనే  బైక్​లు మొరాయించాయి. దీంతో వాళ్లు బంకుకు  వచ్చి సిబ్బందిని నిలదీశారు.  సిబ్బంది పొంతన లేని సమాధానం చెప్పారు.

ALSO READ : 27న ఖమ్మం జిల్లాకు..అమిత్ షా : సుధాకర్ రెడ్డి

అనుమానం వచ్చి బాటిళ్లలో పెట్రోలు పోసి చూశారు. అది కల్తీ పెట్రోల్​ అని  నిరసన వ్యక్తం చేశారు. యజమానిపై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించేదిలేదని రోడ్డుపై బైఠాయించారు.  ఎస్సై షేక్​జానీపాష  అక్కడి చేరుకొని,   ఓనర్​పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.