చర్చలేకుండా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును సభలో ఆమోదించడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు సమాజ్ వాద్ పార్టీ ఎంపీ జయాబచ్చన్ . తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రకమైన వాతావరణాన్ని చూడటం ఇదే మొదటిసారన్నారు. పూర్తి గందరగోళం మధ్య బిల్లు ఆమోదించారన్నారు. ప్రత్యేక పార్లమెంటు రక్షణ బిల్లును ఇప్పుడు ఆమోదించాలన్నారు. సభలో చిన్న పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు జయా బచ్చన్. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఇవాళ ఉభయ సభలు మూజువాణి ఓటుతో ఆమోదించాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా వేశారు.
In so many years that I've been here, this is the first time I'm seeing this kind of environment. Bill was passed in absolute chaos. I feel that a special Parliament protection bill should now be passed. Small parties don't get the chance to speak: SP MP Jaya Bachchan pic.twitter.com/mzIyOFCGYw
— ANI (@ANI) November 29, 2021